ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నిరంకుశ పాలన

ABN, First Publish Date - 2021-11-30T04:51:37+05:30

కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలది నిరంకుశ పాలనని డీసీసీ అధ్యక్షడు అహమ్మద్‌ అలీఖాన్‌ అన్నారు.

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అర్బన్‌) నవంబరు 29: కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలది నిరంకుశ పాలనని డీసీసీ అధ్యక్షడు అహమ్మద్‌ అలీఖాన్‌ అన్నారు. నగరంలో కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌ ఆధ్వర్యంలో జన జాగరణ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలు దేరి పాతబస్టాండ్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్దకు చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అహమ్మద్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్తపై పన్ను భారం ప్రజలపై మోపం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేసులకు భయపడి సీఎం జగన్‌ బీజేపీ చేతిలో కీలుబోమ్మలా మారారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాలని, లేదంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, పెద్దారెడ్డి, పాలేం సుజాత, బ్రతుకన్న, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-30T04:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising