ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు

ABN, First Publish Date - 2021-12-03T05:22:43+05:30

శ్రీశైల బ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ఎనర్జీ, ఎన్విరాన్‌ మెంట్‌, ఫారెస్ట్‌, సైన్స్‌్క్షటెక్నాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ ఎ. మల్లికార్జునరెడ్డి దర్శించుకున్నారు.

స్వామివార్లను దర్శించుకొని వస్తున్న మంత్రి బాలినేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, డిసెంబరు 2: శ్రీశైల బ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ఎనర్జీ, ఎన్విరాన్‌ మెంట్‌, ఫారెస్ట్‌, సైన్స్‌్క్షటెక్నాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ ఎ. మల్లికార్జునరెడ్డి దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన వీరికి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దర్శానార్థం వచ్చిన వీరు స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీశైల మహాక్షేత్రంలో ధన్వంతరి, ఆయుష్‌ హోమం నిర్వహించారు. పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి హోమం చేశారు. శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకానికి గురువారం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌కు చెందిన బి. నరసింహ, సోదరులు కలసి రూ.5 లక్షల విరాళాన్ని దేవస్థానం అధికారికి అందజేశారు. ఆలయ అధికారులు శేష వస్ర్తాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు. 

Updated Date - 2021-12-03T05:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising