ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించాలి: జేసీ

ABN, First Publish Date - 2021-11-28T05:56:34+05:30

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) ఎంకెవీ శ్రీనివాసులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల, నవంబరు 27: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) ఎంకెవీ శ్రీనివాసులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని 1, 37వ వార్డు సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల వారీగా అన్ని ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఇప్పటి వరకు గుర్తించిన వారు ఎంతమంది, పరిశీలన, సర్వే, డేటా ఎంట్రీ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 1వ వార్డులోని నలుగురికి, 37వ వార్డులోని 13 మందికి  రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశారు. జేసీ వెంట ఇన్‌చార్జి ఆర్డీవో మల్లికార్జునుడు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, తహసీల్దార్‌ రవికుమార్‌, హౌసింగ్‌ డీఈ సత్యరాజ్‌, కౌన్సిలర్లు, వార్డు సచివాలయాల అడ్మిన్‌లు ఉన్నారు. 


Updated Date - 2021-11-28T05:56:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising