ఎయిర్పోర్టును సందర్శించిన ఇండిగో బృందం
ABN, First Publish Date - 2021-01-22T06:01:32+05:30
ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఇండిగో ప్రతినిధుల బృందం గురువారం పరిశీలించింది
ఓర్వకల్లు, జనవరి 21: ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఇండిగో ప్రతినిధుల బృందం గురువారం పరిశీలించింది. అక్షయ్ సుబ్బరామ్, రాహుల్ బజాజ్, రాంబాబు, మెహతాతో కూడిన బృందం ఎయిర్పోర్టును సందర్శించింది. ప్యాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్, రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో సదుపాయాలను చూసి సంతృప్తి వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 5న జరగబోయే సమావేశంలో కర్నూలు నుంచి ఏఏ ప్రాంతాలకు విమానాలను నడిపేది ప్రకటిస్తామని వారు తెలిపారు. విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, ఎయిర్పోర్టు డైరెక్టర్ కైలాష్ మాండల్, ఎయిర్పోర్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-22T06:01:32+05:30 IST