రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
ABN, First Publish Date - 2021-05-12T05:56:03+05:30
two youngmen died by road accident
ప్యాపిలి, మే 11: వెంగళాంపల్లి చెరువు వద్ద 44వ జాతీయ రహదారిపై మంగ ళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. డోన్ వైఎస్ఆర్ నగర్కు చెందిన నాగరాజు(25), సుధా కర్(24) స్నేహితులు. ఇద్దరూ గౌండా పని చేసుకుని జీవనం సాగించేవారు. మంగళవారం మధ్యాహ్నం స్నేహితు లిద్దరూ మోటారు సైకిల్పై పని నిమిత్తం ప్యాపిలికి బయలుదేరారు. మార్గమధ్యంలో వెంగళాంపల్లి చెరువు వద్దకు రాగానే బైకు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగరాజు తలకు బలమైన రక్తగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే ఎస్ఐ మారుతిశంకర్, కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సుధాకర్ను 108 అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాగరాజుకు భార్య లక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. సుధాకర్కు భార్య సులోచన, కొడుకు, కూతురు ఉన్నారు.
Updated Date - 2021-05-12T05:56:03+05:30 IST