చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన ఈసీ
ABN, First Publish Date - 2021-11-15T03:30:09+05:30
కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి ప్రజలను తీసుకువచ్చారని ...
అమరావతి: కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి ప్రజలను తీసుకువచ్చారని ఎన్నికల కమిషన్కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాశారు. చంద్రబాబు ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుప్పంలో బయట వ్యక్తులు ఉండేందుకు వీలు లేదని కలెక్టర్ ,ఎస్పీలకు కమిషన్ సూచించారు.
Updated Date - 2021-11-15T03:30:09+05:30 IST