ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

ABN, First Publish Date - 2021-04-22T06:51:06+05:30

శ్రీకాకుళం నుంచి విజయవాడకు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఇద్దరు యువకులు బుధవారం హనుమాన్‌జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పెళ్లిచూపులకు వెళ్లి వస్తుండగా దుర్ఘటన

హనుమాన్‌జంక్షన్‌, ఏప్రిల్‌ 21 : శ్రీకాకుళం నుంచి విజయవాడకు  ద్విచక్రవాహనంపై వస్తుండగా  ఇద్దరు యువకులు  బుధవారం హనుమాన్‌జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.   శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాసుదేవ పట్నానికి చెందిన ఊరడ సత్యనారాయణ (24) విజయవాడలో పెయింట్‌ పని చేస్తున్నాడు. తన పెళ్లి చూపులు  విషయమై  స్నేహితుడైన  విజయవాడ  సమీపంలోని గుణదలకు చెందిన  కేతల యశోధకృష్ణ (28)తో కలిసి ఈనెల  19న విజయవాడ నుంచి  శ్రీకాకళం జిల్లా  తన సొంతూరుకు  ద్విచక్ర వాహనంపై  వెళ్లారు. మంగళవారం  పెళ్లి చూపులు అవ్వగానే   ఇద్దరు  తిరుగు  ప్రయాణమయ్యారు. బుధవారం ఉదయం 6గంటల ప్రాంతంలో  హనుమాన్‌జంక్షన్‌ వద్ద లయన్స్‌ క్లబ్‌ సమీపంలో ప్రమాదవశాత్తు  రహదారి డివైడర్‌ను ఢీకొన్నారు.  ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.  ఇరువురు  పెయింటింగ్‌  కార్మికులే రాత్రంతా ప్రయాణం చేసి ఉండడంతో నిద్ర మత్తులో డివైడరును ఢీకొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హనుమాన్‌ జంక్షన్‌ ఎస్సై ఎన్‌.చంటిబాబు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు నూజివీడు ప్రభుత్వా సుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 

Updated Date - 2021-04-22T06:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising