22న పుష్పగిరి పీఠాధిపతి యాత్ర
ABN, First Publish Date - 2021-01-21T05:55:33+05:30
22న పుష్పగిరి పీఠాధిపతి యాత్ర
విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): దేవా లయాల పరిరక్షణ కోసం పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి నిర్వహించే ధర్మపరిరక్షణ యాత్ర విజయవాడలో ఈనెల 22న ప్రారంభమవుతుందని దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరమాముల వెంకట రమణ శర్మ, రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు కనక దుర్గమ్మను దర్శనం చేసుకుని యాత్రను ప్రారంభి స్తారన్నారు. 30న విశాఖపట్నం చేరుకుని సింహాచ లంలోని లక్ష్మీనరసింహస్వామి, కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రామతీర్థం చేరుకుంటారని వివరించారు.
Updated Date - 2021-01-21T05:55:33+05:30 IST