ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక కొరతతో రోడ్డున పడ్డాం

ABN, First Publish Date - 2021-12-02T06:34:38+05:30

కరోనాతో పనులు లేక అల్లాడుతున్న సమయంలో ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయటంతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు హరికృష్ణారెడ్డి అన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సమస్యలు పరిష్కరించాలని భనవ నిర్మాణ కార్మికుల నిరసన

కంచికచర్ల రూరల్‌ : కరోనాతో పనులు లేక అల్లాడుతున్న సమయంలో ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయటంతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు హరికృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయటంతో పాటు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహీల్దార్‌ రాజకుమారి, ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ బోర్డు నుంచి బాధిత కార్మికులకు అందాల్సిన పరిహారం నేటికీ అందలేదన్నారు. దీనికి తోడు పనులులేక జీవనం సాగక కార్మికులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు భూషణం, రాజు, గాలీషా, కొండ, వీరయ్య, శీను. స్వామి, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-02T06:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising