తాగునీటి పైపులైన్ ధ్వంసం
ABN, First Publish Date - 2021-04-18T06:00:58+05:30
తాగునీటి పైపులైన్ ధ్వంసం
పటమట, ఏప్రిల్ 17: 13వ డివిజన్ ఎక్ర్టిసిటీ కాలనీలోని రామదూత్ నగర్లో శనివారం తాగునీరు పైపులైను ధ్వంసమై నీరు వృథాగా పోయింది. ఓ ప్రైవేటు ఇంటర్నెట్ సంస్థ భూమార్గం నుంచి కేబుల్ లైను ఏర్పాటు పనులను చేపడు తున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించకుండా అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టటంతో పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పైపులైను ధ్వంసం అయ్యింది. దీంతో కాలనీ వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన ఆయన వెంటనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ధ్వంసమైన పైపులైను స్ధానంలో కొత్త పైపులైను ఏర్పాటు చేయిస్తున్నారు.
Updated Date - 2021-04-18T06:00:58+05:30 IST