రైతుల పాదయాత్రకు బయలుదేరిన బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని
ABN, First Publish Date - 2021-11-21T16:38:06+05:30
అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని బయలుదేరారు.
విజయవాడ: అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ నేతలు ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి వచ్చిన వారికి రైతులు దారిపొడవునా కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రాజధాని ఎక్కడికి పోదని, అమరవతే ఏపీ రాజధాని అంటూ తాము మొదటి నుంచి ఇదే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలు చూసే తాను ఆనాడు మాట్లాడానన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం సూచనతోనే నేతలంతా పాదయాత్రకు వెళ్తున్నామన్నారు. ఏ క్షణమైన రాజధాని తరలిపోతుందని చెప్పే వార్తలను తాము పట్టించుకోమని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
Updated Date - 2021-11-21T16:38:06+05:30 IST