విజయవాడలో నారా లోకేశ్పై కేసు నమోదు
ABN, First Publish Date - 2021-06-19T23:15:16+05:30
సూర్యారావుపేట పీఎస్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని లోకేశ్, మరోనేత కొల్లు రవీంద్రపై
విజయవాడ: సూర్యారావుపేట పీఎస్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని లోకేశ్, మరోనేత కొల్లు రవీంద్రపై కేసులు నమోదు చేశారు. ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పరామర్శించిన సందర్భంలో పరామర్శించడానికి సూర్యారావుపేట కోర్టు సెంటర్కు లోకేశ్, కొల్లు రవీంద్ర వెళ్లారు. ఆ సమయంలో కరోనా నిబంధనలు పట్టించుకోలేదన్న కారణంగా ఈ నెల 12న ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వివరణ ఇవ్వవలసింగా తాజాగా నోటీసులు పంపారు.
Updated Date - 2021-06-19T23:15:16+05:30 IST