ఇంద్రకీలాద్రిపై కానరాని దుర్గగుడి పాలకమండలి సభ్యులు
ABN, First Publish Date - 2021-10-11T18:03:00+05:30
ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సభ్యులు కానరాని పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో భక్తులు పోటెత్తినా ఏం పట్టనట్లుగా పాలకమండలి సభ్యులు రూంలకే పరిమితమయ్యారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సభ్యులు కానరాని పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో భక్తులు పోటెత్తినా ఏం పట్టనట్లుగా పాలకమండలి సభ్యులు రూంలకే పరిమితమయ్యారు. భక్తుల సమస్యలు పట్టించుకోకపోగా తమ వారికి దర్శనం సరిగా అవడం లేదంటూ అధికారులపై వీరంగం చేస్తున్నారు. నగరోత్సవంలో అధికారులతో పాటు పాలకమండలి సభ్యులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత రెండు రోజులుగా పాలకమండలి సభ్యులు ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు వస్తున్న క్రమంలో దర్శనాలు చేపిస్తూ పాలకమండలి సభ్యులు బిజీబిజీగా గడుపుతున్నారు. పాలకమండలి సభ్యుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేవ కాకుండా దర్శనాలకే పరిమితం అవ్వడంతో పాలకమండలి సభ్యులను పోలీసులు లైట్ తీసుకుంటున్నారు.
Updated Date - 2021-10-11T18:03:00+05:30 IST