కృష్ణా జిల్లాలో తొలి బ్లాక్ఫంగస్ కేసు గుర్తింపు
ABN, First Publish Date - 2021-05-18T19:08:01+05:30
కృష్ణా జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు బయటపడింది. ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్తో మృతిచెందాడు.
విజయవాడ: కృష్ణా జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు బయటపడింది. ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్తో మృతిచెందాడు. దీనిపై కలెక్టర్ ఇంతియాజ్ విచారణకు ఆదేశించారు. కాటూరు పంచాయితీ కార్యదర్శి బాణవతు రాజశేఖర్... మొదట కొవిడ్తో మృతి చెందినట్లు భావించారు. తర్వాత బ్లాక్ ఫంగస్తో రాజశేఖర్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడి స్వస్థలం ఏ కొండూరు మండల గొల్లమందల గ్రామంగా తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Updated Date - 2021-05-18T19:08:01+05:30 IST