శాంతిభద్రతలకు విఘాతం...అన్నదమ్ముల నగర బహిష్కరణ
ABN, First Publish Date - 2021-09-30T14:00:00+05:30
నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల 6 నెలలు పాటు నగర బహిష్కరణకు గురయ్యారు.
విజయవాడ: నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు 6 నెలలు పాటు నగర బహిష్కరణకు గురయ్యారు. గుణదల బెత్లహమ్ నగరంలో నివాసం ఉంటున్న మధిర అరుణ్ కుమార్, మధిర వరుణ్ కుమార్పై నగర బహిష్కరణ విధిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లిన వీరు బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సీపీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
Updated Date - 2021-09-30T14:00:00+05:30 IST