దసరా సీజన్లో ట్రావెల్స్ టికెట్ రేట్లు పెంచితే చర్యలు: వెంకటేశ్వర రావు
ABN, First Publish Date - 2021-10-04T17:38:53+05:30
దసరా సీజన్లో ట్రావెల్స్ టికెట్ రేట్లు పెంచితే చర్యలు తప్పవని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు.
అమరావతి: దసరా సీజన్లో ట్రావెల్స్ టికెట్ రేట్లు పెంచితే చర్యలు తప్పవని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. 100 బస్సులపై టాక్స్ ఎగవేతతో పాటు వివిధ కేసులు రాశామని తెలిపారు. ఆన్లైన్లో అధిక ధరల అమ్మకంపైనా చర్యలు తీసుకుంటామన్నారు. టికెట్ ధరల పెంపుపై ఇంకా ఎటువంటి కేసులు పెట్టలేదని చెప్పారు. ప్రయాణికులు జిల్లా రవాణా అధికారులకు ఫిర్యాదు చెయ్యవచ్చన్నారు. రాష్ట్రంలో 700 బస్సులు ఉన్నాయని....కోవిడ్తో ప్రైవేటు బస్సుల ఆపరేషన్స్ తగ్గాయని తెలిపారు. ట్రావెల్స్ వెబ్సైట్లో టికెట్ ధరలు మానిటరింగ్ చేస్తామని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
Updated Date - 2021-10-04T17:38:53+05:30 IST