రోడ్లపై పేకాటాడుతున్న వారిని తప్పుకోండి అన్నందుకు....
ABN, First Publish Date - 2021-06-18T14:27:42+05:30
పేకాట విషయంలో తలెత్తిన వివాదం ప్రాణాల మీదకు తెచ్చింది.
విజయవాడ: పేకాట విషయంలో తలెత్తిన వివాదం ప్రాణాల మీదకు తెచ్చింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్దవరం గ్రామ శివారు రాజీవ్ కాలనీ రోడ్లపైన రాత్రి వేళ సమయాల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులను పక్కకి తప్పుకోండి అనడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది. అదే గ్రామానికి చెందిన నాగరాజు, గోపిలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-06-18T14:27:42+05:30 IST