మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిపిస్తే వాహనం సీజ్
ABN, First Publish Date - 2021-05-09T04:54:18+05:30
మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిపిస్తే వాహనం సీజ్
విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి) : రోజూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నా చిన్నచిన్న కారణాలతో బయటకు వస్తు న్నారా? వీధుల నుంచి ప్రధాన రహదారుల వరకు రోడ్డుపైనే కూర్చుని మాట్లాడుకుంటున్నారా? ఆదివారం నుంచి ఇలాంటి పనులకు చెక్. ఇకపై మధ్యాహ్నం 12 గంటల తర్వాత అకారణంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తామని పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే రహదారులపై సంచరించడానికి సడలింపు ఉందని, ఆ తర్వాత అత్యవసరాలకే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
Updated Date - 2021-05-09T04:54:18+05:30 IST