3,880 మందికి కొవిడ్ వ్యాక్సిన్
ABN, First Publish Date - 2021-01-22T06:53:06+05:30
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత ఊపందుకుంది.
ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత ఊపందుకుంది. గురువారం జిల్లావ్యాప్తంగా 82 కేంద్రాల్లో మొత్తం 3,880 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకా ఇచ్చారు. ఇందులో 2,356 మందికి కోవిషీల్డ్, 1524 మందికి కోవాగ్జిన్ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో ఈ ఆరు రోజుల్లో మొత్తం 9,237 మంది హెల్త్ కేర్ వర్కర్లు కొవిడ్ టీకా తీసుకున్నట్లయింది. తొలిరోజు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురైనా.. తర్వాత టీకా తీసుకుంటున్నవారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోవడంతో జిల్లా అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.
Updated Date - 2021-01-22T06:53:06+05:30 IST