ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం
ABN, First Publish Date - 2021-11-28T06:00:06+05:30
ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం
మాజీ మంత్రి ఉమా ట్వీట్
జి.కొండూరు, నవంబరు 27: లక్షల కోట్ల అప్పులు, నిబంధనల ఉల్లంఘనలతో రాష్ట్రంలో ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్లో ఆరోపించారు. ‘నిధుల మళ్లింపు, పీడీ ఖాతాలతో సర్కార్ గోల్మాల్ చేస్తోంది. ప్రజాధనం రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడకుండా ఖర్చయిపోతోంది. యఽఽథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన చేశారన్న కాగ్..అయినా మరో లక్ష కోట్ల అప్పు కోసం చేస్తున్న ఎత్తులు ఆర్థిక విధ్వంసం కాదా?’ సీఎం జగన్ అని ఉమా ట్వీట్ చేశారు.
Updated Date - 2021-11-28T06:00:06+05:30 IST