AP: గవర్నర్తో టీటీడీ చైర్మన్ భేటీ
ABN, First Publish Date - 2021-11-02T18:15:08+05:30
: ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బేటీ అయ్యారు.
అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బేటీ అయ్యారు. మంగళవారం రాజ్భవన్కు వచ్చిన ఆయన గవర్నర్కు స్వామి వారి ప్రసాదం, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను బహుకరించారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాలను గురించి గవర్నర్కు సబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్ధితుల నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్కు గవర్నర్ సూచించారు.
Updated Date - 2021-11-02T18:15:08+05:30 IST