కొండపై కార్తీక సందడి
ABN, First Publish Date - 2021-11-29T06:16:21+05:30
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవా ల సందడి కొనసాగుతోంది.
భారీగా తరలివచ్చిన భక్తజనం
దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు
విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవా ల సందడి కొనసాగుతోంది. వేద పండితులు, అర్చకులు ప్రతిరోజూ సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ సే వలతోపాటు దుర్గమ్మకు స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనల తో కళానీరాజనాలు సమర్పిస్తున్నారు. ఈ పవిత్ర మాసం లో దుర్గమ్మను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడం తో ఇంద్రకీలాద్రి.. భక్తజనకీలాద్రిగా మారింది. క్యూలైన్లు కిటకిటలాడాయి. పరిసరాలు సందడిగా మారాయి. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు, నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు సతీసమేతంగా ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.
Updated Date - 2021-11-29T06:16:21+05:30 IST