ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్, జగన్, షర్మిలది ట్రై యాంగిల్ బిజినెస్ స్టోరీ: ఎంపీ కేశినేని

ABN, First Publish Date - 2021-07-11T17:59:58+05:30

కేసీఆర్, జగన్, షర్మిలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేసీఆర్, జగన్, షర్మిలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, జగన్, షర్మిలది ట్రై యాంగిల్ బిజినెస్ స్టోరీ అని అన్నారు. ముగ్గురూ ఒకటే అని... రెండు రాష్ట్రాలు దోచుకోవడానికి ముగ్గురూ కలసి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్, జగన్ అన్ని రకాలుగా సహకరించుకున్నారని అన్నారు. కేసీఆర్, జగన్ ఒకటే..ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని వ్యాఖ్యానించారు. జగన్ ఆస్తులు, పెట్టుబడులు హైదరాబాద్‌లో ఉన్నాయని..అందుకే కేసీఆర్‌కు జగన్ సరెండర్ అయ్యారని అన్నారు.  ఆ విషయం ప్రజలకు కూడా అర్థం అవుతుందని ఆయన తెలిపారు. కేసీఆర్ నీటి వాటాలు కోసం సవాల్ చేస్తుంటే జగన్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు, హక్కుల కోసం పోరాటం చేయాల్సింది జగన్, వైసీపీ నేతలే అని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-11T17:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising