కేంద్ర మంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు
ABN, First Publish Date - 2021-08-31T20:52:12+05:30
విజయవాడ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మల్యేల బృందం మంగళవారం కలిసింది. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు.
విజయవాడ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మల్యేల బృందం మంగళవారం కలిసింది. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్రం జారీ చేసిన గెజిట్లో వెలిగొండ ప్రాజెక్ట్ను ప్రకటించలేదన్నారు. తక్షణమే అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్లో చేర్చాలని కోరారు. ప్రకాశం జిల్లాలో కరువు, ప్రజల ఇబ్బందులు, తాగు, సాగు నీటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యలపై మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డా. శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు బోలినేని రామారావు, ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, బీఎన్. విజయ్కుమార్ ముత్తముల అశోక్ రెడ్డి, నేతలు గూడూరి ఎరిక్షన్ బాబు, దామచర్ల సత్య తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
Updated Date - 2021-08-31T20:52:12+05:30 IST