ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిమినల్ కేసుల్లో విచారణ జాప్యం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం: Yanamala

ABN, First Publish Date - 2021-08-26T19:10:12+05:30

సీబీఐ, ఈడీ కేసుల సత్వర విచారణకు సుప్రీం పూనుకోవడం శుభపరిణామమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీబీఐ, ఈడీ కేసుల సత్వర విచారణకు సుప్రీం పూనుకోవడం శుభపరిణామమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో నేరస్తుల్ని నిలువరించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యమన్నారు. క్రిమినల్ కేసుల్లో విచారణ జాప్యం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని తెలిపారు. నేరస్తులకు శిక్ష పడినప్పుడే ఆదర్శవంతమైన సమాజాన్ని అందించగలమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 138 సీబీఐ, ఈడీ కేసులు దశాబ్ద కాలంగా పెండింగులో ఉన్నాయన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు తమ ప్రజాప్రతినిధి అక్రమాలు తెలియాల్సిందే అని స్పష్టం చేశారు. అప్పుడే చట్ట సభల్లోకి నేరస్తులు, ఆర్ధిక ఉగ్రవాదులు రాకుండా అడ్డుకోగలమన్నారు. అమికస్ క్యూరీ సూచన మేరకు విచారణ పర్యవేక్షణకు కమిటీ వేయాలని తెలిపారు. రాజకీయాల్లోకి నేరస్తుల్ని నిరోధించినప్పుడే ప్రజా సంపదను కాపాడగలమని చెప్పారు. నేరస్తులు లేని రాజకీయాలతోనే రాజకీయ-ఆర్ధిక-సామాజిక అసమానతల నివారణ అని అన్నారు. చట్టం సామాన్యులకు ఒకలా.. రాజకీయ నేరస్తులకు ఒకలా తయారైందని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-08-26T19:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising