ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేసేది రైతు దగా- కప్పిపెట్టుకోవడానికి ప్రకటనల హవా: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2021-05-25T17:50:52+05:30

రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడు తుఫానుల్లో 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని... కానీ పంటల బీమా ఇస్తున్నది 15.15 లక్షల మంది రైతులకు మాత్రమే అని మండిపడ్డారు. చేసేది రైతు దగా- కప్పిపెట్టుకోవడానికి ప్రకటనల హవా అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లోనూ అన్నీ అబద్ధాలే అని అన్నారు. బూటకపు లెక్కలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రైతులు రూ.15 వేల కోట్ల మేర పంట నష్టపోతే జగన్ రెడ్డి ఇస్తున్నది నామమాత్రమే అని విమర్శించారు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకుండానే చెల్లించినట్లు జగన్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధం చెప్పారన్నారు. ప్రతిపక్ష నేత నిలిదీసిన తర్వాత అదే రోజు రాత్రి రూ.590 కోట్లు ప్రీమియం కోసం జీవో విడుదల చేశారని తెలిపారు. మోసపూరిత విధానాలు విడనాడి కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని సోమిరెడ్డి హితవుపలికారు.

Updated Date - 2021-05-25T17:50:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising