ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సజ్జల తనపై తానే కేసు పెట్టుకుంటాడా?: సూర్యప్రకాష్

ABN, First Publish Date - 2021-05-11T19:09:40+05:30

రుయా ఆసుపత్రి ఘటనలో ప్రభుత్వం తక్షణమే వాస్తవాలు బయటపెట్టాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రుయా ఆసుపత్రి ఘటనలో ప్రభుత్వం తక్షణమే వాస్తవాలు బయటపెట్టాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఘటన జరిగే సమయానికి ఎందరు రోగులున్నారు.. ఎందరు చనిపోయారు..ఎందరి పరిస్థితి విషమంగా ఉందో తక్షణమే వెల్లడించాలన్నారు. ప్రతిపక్షనేతపై, పత్రికలపై రాజద్రోహ నేరం కింద కేసులు పెట్టాలంటున్న సజ్జల... రుయా ఘటనకు సంబంధించి ఎవరిపై కేసులుపెడతారని ప్రశ్నించారు. మరణాలకు కారకుడైన ముఖ్యమంత్రిపైనా..లేక మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వంపైనా? ...లేక 24 నెలలుగా సలహాదారుగా కొనసాగుతున్న సజ్జల తనపై తానే కేసు పెట్టుకుంటాడా? అని నిలదీశారు. రుయా ఘటనకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. విజయనగరం ఘటన జరిగినప్పుడే ముఖ్యమంత్రి స్పందించి ఉంటే రుయాలో చావులు సంభవించేవికావన్నారు. నిన్న రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే ఈరోజు ఉదయం 8 గంటలకు ఆరోగ్యశాఖా మంత్రి ఆరాలు తీస్తారా అని మండిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-05-11T19:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising