జలవనరుల ప్రాజెక్టులపై ఆనాడే చెప్పినా మంత్రి వినలేదు: లోకేష్
ABN, First Publish Date - 2021-06-23T18:15:26+05:30
తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మండలిలో గట్టిగా పోరాడామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు.
అమరావతి: తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మండలిలో గట్టిగా పోరాడామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. తెలంగాణ భూభాగంపై పెట్టే జలవనరుల ప్రాజెక్టులకు ఏపీ నిధులు ఇస్తుందని కౌన్సిల్లో మంత్రి అనీల్ ప్రకటించారని అయితే...చారిత్రాత్మక తప్పు చేస్తున్నారని ఆనాడే హెచ్చరించినా మంత్రి వినలేదన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని ప్రధాన ప్రతిపక్షం ఇచ్చే మంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఇప్పుడు చేసే తప్పిదాలకు భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకూడదని లోకేష్ సూచించారు.
Updated Date - 2021-06-23T18:15:26+05:30 IST