దూళిపాళ్ల నరేంద్ర ఏం తప్పు చేశారు ?: కొల్లు రవీంద్ర
ABN, First Publish Date - 2021-04-23T16:43:44+05:30
టీడీపీ సీనియర్ నాయకులు దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ను మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తప్పుబట్టారు.
కృష్ణా: టీడీపీ సీనియర్ నాయకులు దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ను మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తప్పుబట్టారు. ఫ్యాక్షన్ భావజాలం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పాలన ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. దూళిపాళ్ల నరేంద్ర ఏం తప్పు చేశారని... ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తెల్లవారుజామున 100 మంది పోలీసులతో ఆయన ఇంటిని చుట్టుముట్టడం ఏంటని..ఆయన ఏమన్నా టెర్రరిస్టా, ఉగ్రవాదా అని నిలదీశారు. దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంగం డైరీని నిర్వీర్యం చేసి దానిని అమూల్కు కట్టబెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని ఆరోపించారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రజలను కాపాడలేని ప్రభుత్వం టీడీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
Updated Date - 2021-04-23T16:43:44+05:30 IST