పాలనలో విఫలమై మాటలు మార్చినమాట వాస్తవం కాదా?: దేవినేని
ABN, First Publish Date - 2021-01-21T17:13:27+05:30
ప్రజల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ప్రజల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామన్నారు.. అధికారంలోకి వచ్చాక 6నెలల్లో ఇస్తామన్నారు. మాట మార్చి నాణ్యమైన బియ్యమని చెప్పి, 20నెలల తరువాత అదే బియ్యాన్ని పేరులో నాణ్యత చేర్చిఇస్తున్నారు. వాహనాల కొనుగోలు భారం వినియోగదారులపై మోపారు. పాలనలో విఫలమై మాటలు మార్చినమాట వాస్తవం కాదా?’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.
Updated Date - 2021-01-21T17:13:27+05:30 IST