కేంద్రం పెద్దన్న పాత్రను మరవడం తెలుగు ప్రజల దురదృష్టం: దేవతోటి
ABN, First Publish Date - 2021-07-17T17:00:10+05:30
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం అత్యావశ్యంగా మారిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం అత్యావశ్యంగా మారిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రను మరిచిపోవడం తెలుగు ప్రజల దురదృష్టమని తెలిపారు. పునర్విభజన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోని తెలుగు రాష్ట్రాల నీటి ప్రాజెక్టులు, నీటి పంపకాలు కేంద్రం అజమాయిషీలోకి తీసుకోవాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలని దేవతోటి నాగరాజు అన్నారు.
Updated Date - 2021-07-17T17:00:10+05:30 IST