టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని చూసి ఎందుకు ఉలిక్కిపడుతున్నారు..?: Devathoti
ABN, First Publish Date - 2021-07-31T16:22:11+05:30
కొండపల్లి అక్రమ మైనింగ్ విషయంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలనకు వెళ్తుంటే ప్రభుత్వం
అమరావతి: కొండపల్లి అక్రమ మైనింగ్ విషయంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలనకు వెళ్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తోందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు ప్రశ్నించారు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేయకపోతే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని చూసి ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం సహజ సంపదలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ.. భవిష్యత్ తరాల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. అరెస్టులతో తమ అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం అవివేకమని దేవతోటి నాగరాజు అన్నారు.
Updated Date - 2021-07-31T16:22:11+05:30 IST