ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రతీ దాడికి కచ్చితంగా సమాధానం చెబుతాం: Bonda uma

ABN, First Publish Date - 2021-10-20T14:23:09+05:30

వైసీపీ రౌడి రాజ్యంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ రౌడి రాజ్యంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అవినీతి అక్రమాలు బయటపెడితే దాడులు, పోలీస్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఆఫీసుపై దాడి సిగ్గుచేటన్నారు. డీజీపీ ఆఫీసు పక్కనే రక్షణ లేకపోతే రాష్టంలో ఎక్కడా లా&ఆర్డరు లేదని అన్నారు. డీజీపీ, పోలీసులే గుండాలకు అండగా ఉండటం దేశ చరిత్రలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.


మొన్న చంద్రబాబుపై హత్యాయత్నం జరిగినా వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనటానికి నిన్న టీడీపీ ఆఫీసుపై దాడే నిదర్శనమన్నారు. వైసీపీ చేసే ప్రతి దాడికి సమాధానం కచ్చితంగా చెబుతామని హెచ్చరించారు. వైసీపీని ప్రజలు చీపుర్లతో కొట్టి తరిమే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఈ రోజు బంద్ ప్రజాస్వామ్య రక్షణ కోసమే టీడీపీ పిలుపునిచ్చిందని.. ప్రజలు బంద్‌ను విజయవంతం చేయాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-10-20T14:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising