ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనూష కుటుంబానికి అండగా లోకేష్ ఉండటం తప్పా?: Bonda

ABN, First Publish Date - 2021-09-09T13:51:20+05:30

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా టీడీపీ వుంటే వైసీపీ పోలీసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అమల్లోలేని దిశా చట్టం మహిళలకు రక్షణగా ఉంటుందని వైసీపీ చెబుతుందని విమర్శించారు. దిశా చట్టంతో ఏ కేసులో నిందితుడికి శిక్ష వేశారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్‌ నరసరావుపేట వెళితే వైసీపీ బండారం బట్టబయలు అవుతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు. అనూష కుటుంబానికి అండగా లోకేష్ ఉండటం తప్పా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్‌ను గాలికి వదిలేసిన వైసీపీ...టీడీపీ నేతలపై మాత్రం పోలీసులను ఉపయోగిస్తుందని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-09T13:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising