ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-06-17T18:08:40+05:30

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కక్షలు, కార్పణ్యాలతో జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్షతో టీడీపీ నేతలను బలిగొంటున్నారని అన్నారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో టీడీపీ నేతలు వడ్డి నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిని దారుణంగా హతమార్చారని... ఈ ఘటన వెనుక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తముందని ఆయన ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నా పోలీసులు చోద్యం చూడటం హేయమని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని వ్యాఖ్యానించారు. హత్యా ఘటనకు పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

Updated Date - 2021-06-17T18:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising