ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గత ప్రభుత్వం వలే రైతు రుణమాఫీ చేయాలి: Achennaidu

ABN, First Publish Date - 2021-07-29T19:19:44+05:30

ధాన్యం బకాయిల చెల్లింపు విజయం రోడ్డెక్కిన రైతులదే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ధాన్యం బకాయిల చెల్లింపు విజయం రోడ్డెక్కిన రైతులదే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలు విడుదల చేయడంలో జగన్ రెడ్డి నెలలు తరబడి ఆలస్యం చేశారన్నారు. టీడీపీ పిలుపు మేరకు అన్నదాతలు ధాన్యం బకాయిల చెల్లింపు కోసం రోడ్డెక్కారని అన్నారు. వ్యవసాయరంగం పట్ల జగన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని విమర్శించారు.  ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ధాన్యం రైతులు నష్టపోయారన్నారు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. ఏపీలో రైతులపై రూ.1.69 లక్షల కోట్ల రుణం ఉందని.. గత ప్రభుత్వం వలే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి, దుబారా అరికడితే రైతు రుణమాఫీ కూడా సాధ్యమే అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-29T19:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising