ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పోలీసులపై ముందు రోజుల్లో చర్యలు తప్పవు : అచ్చెన్న

ABN, First Publish Date - 2021-05-13T17:08:53+05:30

రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులకంటే ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులే ఎక్కువని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులకంటే ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులే ఎక్కువని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచి వేయడానికి చూపిస్తున్న పట్టుదల ప్రజల ప్రాణాలను బలితీసుకొంటున్న కరోనా కట్టడిపై చూపడం లేదని విమర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన  టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, ఇతర టీడీపీ నేతలపై  గుంటూరు  పోలీసులు తప్పుడు కేసు నమోదు చేయడాన్ని  ఖండిస్తున్నామన్నారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన వారిపైనే తప్పుడు  కేసులు పెట్టి ప్రజలకు పోలీసులు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. ఇలా అయితే సామాన్య బాధితులు పోలీసు స్టేషన్‌కి రావాలంటేనే భయపడతారన్నారు. పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యహహరిస్తూ వైసీపీ నేతలకు ఒక చట్టం, ప్రతిపక్ష నేతలకు మరో చట్టం అనుసరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై  ముందు రోజుల్లో చర్యలు తప్పవని హెచ్చరించారు.  టీడీపీ నేతలపై  నమోదు చేసిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-13T17:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising