వ్యక్తిగత ప్రకటనలు చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవు: అచ్చెన్నాయుడు
ABN, First Publish Date - 2021-03-03T18:40:27+05:30
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా ఎవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు ఎవరు చేసినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ దౌర్జన్యాలపై ప్రజాస్వామ్యయుతంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోరాటం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
Updated Date - 2021-03-03T18:40:27+05:30 IST