ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో రైతులకు ప్రభుత్వ సాయం కరువు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-06-24T18:10:10+05:30

వైసీపీ ప్రభుత్వం మామిడి రైతుల సమస్యలను గాలికొదిలిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం మామిడి రైతుల సమస్యలను గాలికొదిలిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వైసీపీ నేతలకు  కమీషన్లు కావాలా అని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రైతులకు ప్రభుత్వం నుంచి  సాయం పూర్తిగా కరువైందన్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో ఏ ఒక్క రైతూ, వ్యవసాయ కూలీ సంతోషంగా లేరన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో తోతాపురి రకం టన్ను రూ.20 వేలు, బేనీషా రకం రూ.40 నుండి 50 వేలు, మల్లిక రకం రూ.60 వేలు, ఇమాంపసంద్ రకం రూ.90 వేలు, నీలం రకం రూ.30 నుండి 40 వేలు దాకా ధర ఉంటే..  వైసీపీ ప్రభుత్వ చర్యలతో తోతాపురి రకం రూ.6 నుండి 8 వేలు, బేనీషా రకం రూ.9 వేలు, మల్లిక రకం రూ. 25 వేలు, నీలం రకం రూ.18 వేలకు తగ్గిపోయాయన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఆయన  సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి నేతృత్వంలో గుజ్జు పాల్పడుతుంటే వైసీపీ నేతలకు కమీషన్లు కావాలా అని నిలదీశారు. పూతలపట్టు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మామిడి  రైతులు నష్టపోయారన్నారు. మామిడి రైతుల డిమాండ్లు పరిష్కరించే వరకు టీడీపీ పోరాటం ఆగదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-24T18:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising