ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షంతో అవస్థలు

ABN, First Publish Date - 2021-04-24T05:17:57+05:30

అకాల వర్షంతో అవస్థలు

గొల్లపూడి మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా వర్షాలు

కొన్నిచోట్ల వడగళ్లతో వాన

భారీ గాలులు, మెరుపులు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నూజివీడులో మామిడి పంటకు స్వల్పనష్టం 

విజయవాడ, ఆంధ్రజ్యోతి/గొల్లపూడి : మండువేసవిలో ఎండలకు అలమటిస్తున్న జిల్లావాసులపై శుక్రవారం భారీవర్షం చల్లదనాన్ని చిలకరించింది. జిల్లావ్యాప్తంగా భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. బందరు తప్ప అన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. భారీ మెరుపులకు తోడు బలమైన గాలులు వీచాయి. దాదాపు అరగంట పాటు వర్షం పడింది. గాలివానకు నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్‌ పునరుద్ధరించినా ఓల్టేజీ సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గన్నవరం ప్రాంతంలోని వెంకటనరసింహాపురంలో చెట్లు విరిగి పడ్డాయి. గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. చిన్నరాయి సైజు వడగళ్లు పడ్డాయి. చాలాచోట్ల చెట్లు విరిగిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కాగా, అకాల వర్షం మామిడి రైతులను ఇబ్బంది పెట్టింది. నూజివీడు డివిజన్‌ పరిధిలో మామిడి తోటలకు స్వల్పనష్టం సంభవించింది. కోత దశకు చేరుకుంటున్న సమయంలో మామిడికాయలు రాలిపోయాయి.

గొల్లపూడి మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యం

గొల్లపూడి మార్కెట్‌ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు ధాన్యంపై పట్టాలు కప్పే సమయం కూడా లేకపోయింది. జిల్లాలోని చాలాచోట్ల ధాన్యం పొలాల్లోనే ఉందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.







Updated Date - 2021-04-24T05:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising