కొవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలి: ఆర్డీవో
ABN, First Publish Date - 2021-07-25T06:36:47+05:30
కొవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలి: ఆర్డీవో
విస్సన్నపేట, జూలై 24: కొవిడ్ నియంత్రణకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో కొవిడ్, ఫీవర్ సర్వే, నాడు - నేడు కార్యక్రమాలపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. విస్సన్నపేట సీహెచ్సీ కొవిడ్ టెస్టులు సకాలంలో చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్లో గర్భవతులు, బాలింతలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో వెంకట రమణ పాల్గొన్నారు.
Updated Date - 2021-07-25T06:36:47+05:30 IST