మరదలిపై బావ అత్యాచారయత్నం
ABN, First Publish Date - 2021-04-13T06:08:16+05:30
మరదలిపై బావ అత్యాచారయత్నం
జగ్గయ్యపేట, ఏప్రిల్ 12: భర్త ఆరోగ్యం సరిగా లేదని అక్క ఇంటికి వెళ్లిన వివాహితపై బావ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటనపై పట్టణ పోలీసులు కేసు సోమవారం నమోదు చేశారు. పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన వివాహిత(29) భర్తకు అనారోగ్యంగా ఉండటంతో పట్టణంలో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లింది. ఆమెపై సోదరి భర్త అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసినట్టు ఎస్సై రామారావు తెలిపారు.
Updated Date - 2021-04-13T06:08:16+05:30 IST