ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రోజులు భారీవర్ష సూచన

ABN, First Publish Date - 2021-11-28T05:51:50+05:30

రెండు రోజులు భారీవర్ష సూచన

గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో నేలవాలిన వరిపంటను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊపందుకున్న వరికోతలు

ఆందోళనలో రైతులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాతీరం వె ంబడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. దీంతో రైతుల్లో మళ్లీ అలజడి ఆరంభమైంది. ప్రస్తుతం వరి కోతలు ఊపందుకున్నాయి. భారీవర్షం కురుస్తుందనే హెచ్చరికలతో రైతులు పంటలను కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకాశం వెేుఘావృతమై కనిపించింది. జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లలో వరి, 37వేల హెక్టార్లలో పత్తి సాగు జరిగింది. నాలుగు రోజులుగా వాతావరణం అనుకూలంగా ఉండటంతో వరి కోతలను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో యంత్రాల ద్వారా వరి కోతలు పూర్తిచేసి ధాన్యం ఆరబెట్టారు. వర్షాలు కురిస్తే ఆరబెట్టిన ధాన్యం తడిచిపోతుందనే భయం రైతులను వెంటాడుతోంది. ఇదిలావుంటే, ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగు సలహాలు, సూచనలు ఇస్తున్నామని వ్యవసాయశాఖ జేడీ టి.మోహనరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2021-11-28T05:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising