జీవో 77ను ఉపసంహరించుకోవాలి
ABN, First Publish Date - 2021-01-27T06:34:11+05:30
జీవో 77ను ఉపసంహరించుకోవాలి
పాయకాపురం, జనవరి 26: బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే జీవో నంబర్ 77ను తక్షణమే ఉపసంహరిం చుకోవాలని, లేకుంటే విద్యార్థి సంఘాలతో కలిసి వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివ రావు, బొండా రవితేజ హెచ్చరించారు. కేశినేని భవన్లో టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీ యూసీ, తెలుగు మహిళల ఆధ్వర్యంలో జీవో నెం 77ను రద్దు చేయాలని మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరస నకు టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కమిటీ సంఘీభావాన్ని తెలిపింది. గండూరి మహేష్, సందిరెడ్డి గాయత్రి, చింతల మధుబాబు, దాసరి దుర్గారావు(పెప్సీ), ప్రయాగ కృష్ణ, గాజుల రాజు, చైతన్య పాల్గొన్నారు.
Updated Date - 2021-01-27T06:34:11+05:30 IST