ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలు వ్యాపారమయం

ABN, First Publish Date - 2021-02-27T06:07:01+05:30

రాజకీయాలు వ్యాపారమయం

సభలో మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గన్నవరం, ఫిబ్రవరి 26: రాజకీయాలు వ్యాపార మయంగా మారాయని, విలువలు, సిద్ధాంతాలను ఖూనీ చేసే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వ రరావు అన్నారు. స్థానిక సీపీఎం  కార్యాలయంలో ఇటీ వల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో  గెలిచిన పార్టీ అభ్య ర్థుల అభినందన సభ శుక్రవారం కళ్లం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఎన్నికల్లో బెదిరింపు లు, అధికార, ఆర్థిక బ లాలు పెరిగిపోయా యని చెప్పారు. పంచా యతీ ఎన్నికల్లో ఓటు కు రూ.10వేల వరకూ ఈ మండలంలోనే ఇచ్చారని చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని గెలవటం అభినందనీయమన్నా రు. సీపీఎం జిల్లా కార్య దర్శి ఆర్‌.రఘు మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థులు లక్షలు గుమ్మరించిన పట్టించుకోకుండా ప్రజలు ఎంతో నమ్మకంతో సీపీఎం బలపరిచిన అభ్యర్ధులను గెలిపించటం గొప్ప విషయమన్నారు. సీపీఎం నాయకులు ఎం.హరి బాబు, వై.నరసింహారావు, సర్పంచ్‌లు బడుగు బాలమ్మ, తెల్లాకుల రామ్మోహనరావు, ఎర్రిబోయిన రంగారావు, ఆర్ధిక విశ్లేషకులు గన్నే వెంకట్రావు, సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising