ప్రభుత్వాలు కూడా కళాకారులను గుర్తించాలి: పద్మశ్రీ రామస్వామి
ABN, First Publish Date - 2021-01-26T17:33:11+05:30
ఎన్నో పురస్కారాలు, ప్రజల అభిమానం పొందడం తన అదృష్టమని పద్మశ్రీ అన్నవరపు రామస్వామి అన్నారు.
విజయవాడ: ఎన్నో పురస్కారాలు, ప్రజల అభిమానం పొందడం తన అదృష్టమని పద్మశ్రీ అన్నవరపు రామస్వామి అన్నారు. మంగళవారం ఏబీఎన్తో మాట్లాడుతూ కేంద్రం తన సేవలను గుర్తిస్తూ పద్మశ్రీ ఇచ్చిందని తెలిపారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, తాను కలిసి వేల సంఖ్యలో కచేరీలు చేశామని... ఒకరి కోసం ఒకరం ప్రాణంగా మెలిగేవాళ్లమని గుర్తు చేశారు. మన కళలను ఇతర దేశాలలో కూడా ఎక్కువ మంది నేర్చుకుంటున్నారని చెప్పారు. మీడియా విస్తృతం అయ్యాక నేటి తరంలో ఆసక్తి బాగా పెరిగిందన్నారు. ప్రభుత్వాలు కూడా కళాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహం అందించాలని రామస్వామి కోరారు.
Updated Date - 2021-01-26T17:33:11+05:30 IST