నోబుల్ కళాశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని ధర్నా
ABN, First Publish Date - 2021-11-25T06:39:51+05:30
నోబుల్ కళాశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు.
మచిలీపట్నం టౌన్ : నోబుల్ కళాశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.పవన్కుమార్ ధర్నాకు నాయకత్వం వహించి ప్రసంగించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల మనుగడకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం సరికా దన్నారు. గతంలో మాదిరిగా కళాశాలలకు ఎయిడ్ కొనసాగించాలన్నారు.
Updated Date - 2021-11-25T06:39:51+05:30 IST