ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల పక్షపాతి నెహ్రూ

ABN, First Publish Date - 2021-04-18T06:19:48+05:30

ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల పక్షాన నిలబడ్డ మహనీయుడు మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌ నెహ్రూ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ 

గుణదల, ఏప్రిల్‌ 17: ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల పక్షాన నిలబడ్డ మహనీయుడు మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌ నెహ్రూ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్నారు. దివంగత నెహ్రూ 4వ వర్ధంతి గుణదలలోని దేవినేని నెహ్రూ ఘాట్‌ వద్ద శనివారం నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దేవినేని అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ నెహ్రూ తన 20వ ఏట విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి 70ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పేదలకోసమే పనిచేసేవారన్నారు. జిల్లాలో 5సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత దేవినేని నెహ్రూకే దక్కిందన్నారు. నెహ్రూ ఆశయ సాధనకు తన వంతు కృషి చేస్తానన్నారు. పటమట సెంటర్లో యు.ఎ్‌స.వో రాష్ట్ర అధ్యక్షుడు కొరివి చైతన్య (వర) ఆధ్వర్యంలో చీరల పంపిణీ, అన్నదానం నిర్వహించారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో అవినాష్‌ పాల్గొన్నారు. వైసీపీ సీనియర్‌ నేత కడియాల బుచ్చిబాబు, వైసీపీ ఫ్లోర్‌లీడర్‌ వెంకట సత్యన్నారాయణ, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T06:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising