ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కత్తితో భార్యను చంపిన భర్త

ABN, First Publish Date - 2021-05-06T06:30:28+05:30

భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన పాయకాపురం ఎల్‌బీఎ్‌సనగర్‌ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పోలీసుల అదుపులో నిందితుడు

పాయకాపురం, మే 5 : భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన పాయకాపురం ఎల్‌బీఎ్‌సనగర్‌ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఎల్‌బీఎస్‌ నగర్‌కు చెందిన వడ్డాది దుర్గారావు(32), నీరజా(20) భార్య భర్తలు. గతంలో వేర్వేరు పెళ్లిళ్లు అయిన వీరు ఇరువురు 6 నెలల క్రితం రెండవ వివాహం చేసుకుని ఎల్‌బీఎ్‌సనగర్‌ ప్రాంతంలో  నివసిస్తున్నారు. పెళ్లయిన నాలుగు నెలలకే వీరి మధ్య కలహాలు జరుగుతుండటంతో రెండు నెలల క్రితం నీరజ వాంబేకాలనీలో తల్లితో కలిసి విడిగా ఉంటోంది. బుధవారం తన తల్లితో కలిసి ఎల్‌బీఎస్‌ నగర్‌లోని భర్త ఇంటికి వచ్చిన నీరజ తనకు రావల్సిన రూ.3 వేల డబ్బు ఇవ్వాలని భర్తను అడిగింది. తన దగ్గర లేవని చెప్పటంతో ఇరువురి మధ్య వాదన జరిగంది. ఆ ఆవేశంలో భర్త కత్తితో భార్యను విచక్షణా రహితంగా పొడిచాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ ఏసీపీ షాను షేక్‌, నున్న పోలీసు ఇన్‌చార్జ్‌ సీఐ మహేంద్ర, ఎస్సై హైమావతి సిబందితో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించి స్థానికులను విచారించి, మృతిరాలి తలి ్లనుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-05-06T06:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising