ఎన్ఈసీసీ జోనల్ కార్యాలయంలో బీవీ రావు వర్ధంతి
ABN, First Publish Date - 2021-01-27T06:35:44+05:30
ఎన్ఈసీసీ జోనల్ కార్యాలయంలో బీవీ రావు వర్ధంతి
పాయకాపురం, జనవరి 26: పౌలీ్ట్ర పితామహుడు, ఎన్ఈసీసీ వ్యవస్థాపకుడు బీవీ రావు చిత్రపటానికి జోనల్ చైర్మన్ టి. కుటుంబ రావు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. బీవీ రావు 25వ వర్ధంతిని ఎన్ఈసీసీ జోనల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. అనంతరం కోళ్ల రైతులతో సమావేశం నిర్వహించారు. నిడ మానూరు జడ్పీ పాఠశాల విద్యార్థులకు ఉడకబెట్టిన గుడ్లను పంపిణీ చేశారు. సత్యనారాయణ రెడ్డి, గోకుల్కుమార్ రెడ్డి, సోమిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-01-27T06:35:44+05:30 IST